ముఖ్యాంశాలు

తెలంగాణ

స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరందుద్దిళ్ల శ్రీపాద రావు.

స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు, అది బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడన్నారు. సోమవారం హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీ ఖాదర్ ఫరీద్ మాట్లాడుతూ…. సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం లేకపోతే అది అధికారం అవుతుంది తప్ప సేవ కాదని బలంగా విశ్వసించారన్నారు. చివరి వరకూ… ప్రజా సేవే శ్వాసగా విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. ప్రజాప్రతినిధి సరిగ్గా పనిచేయకపోతే వెనక్కి పిలిచే "రీకాల్" విధానాన్ని మనస్ఫూర్తిగా సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది శ్రీపాద

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రభుత్వ ఉద్యోగులకు,రిటైర్ ఉద్యోగులకు మద్దతుగా నిరహారఎంపీ డీకే అరుణ దీక్ష.

అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించి,మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే DA లు, PRC లు ఎప్పటికప్పుడు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉంటామని మాట చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన ఇప్పటికి DA లు, PRC లు లేవు. పదవి విరమణ చేసే నాటికి పెద్ద మొత్తంలో డబ్బు రావాలని, ఉద్యోగులు నెలనెల దాచుకున్న డబ్బు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందో.. అర్ధం అవుతుంది. పదవి విరమణ పొందిన కుటుంబాలలో ప్రశాంతత లేకుండా చేసింది. దాదాపు 70 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూసి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నిస్తాం. బీజేపీ మీ అందరికి మద్దతుగా ఈ దీక్ష చేపట్టింది. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం మోసం చేసిన ప్రతి తీరు ఎండగడుతాం.

మాట ఇచ్చాం బస్సు తెచ్చాం

తోకల శ్రీనివాసరెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చామని నేడు నెరవేర్చమని తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తోకల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం తో ఎన్నికల్లో ఓడిన గెలిచిన గ్రామానికి బస్సు సర్వీసు ‌తెప్పిస్తానని హామీ ఇచ్చిన తోకల శ్రీనివాసరెడ్డి అన్నమాట ప్రకారం‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు ‌చర్చించి ఆయన ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో శుక్రవారం సర్పంచ్ అభ్యర్థి‌ స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి బస్సు సర్వీస్ ప్రారంభించారు. ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ‌ విద్యార్థులు యువకులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారం కూడా ఎంతగానో ఉందని వారికీ అందరి తరుపున

రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన చైర్మన్ గా కవంపల్లి సత్యనారాయణ

హైదరాబాద్ ఫిబ్రవరి 27 తెలంగాణ కానుక. గాంధీ భవన్ లో జరిగిన రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నూతన నియమితులైన మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే మార్చి 10 తేదీన చలో ఎల్బీ స్టేడియం వేదికగా* సత్యనారాయణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం ఎలా చేద్దం అనేదానిపైన విస్తృతంగా విశ్లేషణ జరిపి. అందరు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ మరియు వైస్ చైర్మన్ వత్తుల నారాయణ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం నుండి మహేశ్వరం మండలం ఆర్గనైజర్ సెక్రెటరీ బొల్లెపాక జంగయ్య, ఎమ్, ఎమ్.సీ వైస్ చైర్మన్ మైత్రి ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల్లో త్వరలో ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మంత్రి సీతక్క.

తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మధుర్‌నగర్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో జిల్లా DWOs లతో సమీక్ష నిర్వ‌హించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల కోసం మొబైల్ అంగన్‌వాడీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన 2,199 భవనాల్లో ఇప్పటికే 500 పూర్తి కాగా మిగిలిన వాటిని త్వ‌ర‌గా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యం, విద్య, రక్షణ విషయాల్లో రాజీ పడకుండా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమ్మ మాట - అంగన్‌వాడీ బాట: ఈ నినాదంతో చేపట్టిన కార్యక్రమాల వల్ల కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

సినిమా

రాజకీయాలు

వీడియోలు